Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట తల్లితో గొడవపడి బైటకొచ్చిన బాలిక, కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (19:58 IST)
కామాంధులు కఠిన శిక్షలు పడతాయని తెలిసి కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన శిక్షలు నమోదుచేయబడ్డాయి. ఇలాంటి కఠిన శిక్షలను లెక్కచేయడంలేదు కామాంధులు. జూన్ 17వ తేదీ రాత్రి మరో బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పూర్తి వివరాలను చూస్తే.. ఓల్డ్ సిటీ లోని చాంద్రాయణగుట్టకు చెందిన 14 ఏళ్ల బాలిక 17వ తేదీ రాత్రిపూట తన తల్లితో గొడవపడి 2 కిలోమీటర్ల దూరంలో వున్న తన అమ్మమ్మ దగ్గరకి వెళ్లింది. మనవరాలికి సర్దిచెప్పి తల్లివద్దకు వెళ్లాలని అమ్మమ్మ బుజ్జగించడంతో తిరుగు ప్రయాణమైంది. ఆమె వెళ్తున్న సమయంలో ఆటోలో నలుగురు వ్యక్తులు ఆమెపై కన్నేసారు.

 
ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని బండ్లగూడ నుంచి పలు ప్రదేశాల్లో తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారిన తర్వాత బాలికను రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేరిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం