గుప్త నిధుల కోసం తొమ్మిదేళ్ల బాలుడి నరబలి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (10:56 IST)
మూఢ నమ్మకం అభంశుభం తెలియని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధుల కోసం చేపట్టిన క్షుద్ర పూజల కోసం తొమ్మిదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లాడిని అపహరించి నరబలి పేరుతో దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకాలో పొహనెషివార్ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించారు. తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని గుంత తీసి అందులో సగం వరకు పాతిపెట్టారు. ఈ దారుణ ఘటన జూలై 18వ తేదీన జరిగింది. శనివారం ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్నామని, అందుకోసం ఈ దారుణానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments