Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో పెళ్లి, గతవారం జమ్ము-కాశ్మీరులో పోస్టింగ్, ఉగ్రవాది చేతిలో హతమైన బ్యాంక్ మేనేజర్

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (17:59 IST)
ఇరవై ఆరేళ్ల విజయ్ కుమార్ తన భార్య మనోజ్ కుమారితో కలిసి ఇటీవల కాశ్మీర్‌కు తిరిగి వచ్చాడు. భారీ హిమాలయాల పాదాల కింద కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు నూతన వధూవరులు ఎంతో ఆనందంగా ఉన్నారు. తను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది అన్నట్లు పెళ్లయిన మూడు నెలలకే, లోయలో లక్ష్యంగా చేసుకున్న పౌర హత్యకు సంబంధించిన మరో కేసులో విజయ్ గురువారం కాల్చివేయబడ్డాడు. దీనితో అతడి భార్య మనోజ్ కుమారి ఒంటరై కుమిలి కుమిలి ఏడుస్తోంది.

 
భగవాన్ హనుమాన్‌గఢ్ రాజస్థాన్ నివాసి, అరేహ్ మోహన్‌పోరా కుల్గామ్‌లోని ఎల్లకై దేహతి బ్యాంక్ (ఇడిబి)లో బ్యాంక్ మేనేజర్‌గా విజయ్ కుమార్‌ పనిచేస్తున్నాడు. బ్యాంకు బ్రాంచ్‌లోకి ప్రవేశించిన హంతకుడు కాల్పులు జరిపి పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. బ్యాంక్‌లో రిక్రూట్ అయిన తర్వాత కుమార్ మొదట 2019లో కాశ్మీర్‌లో పోస్ట్ చేయబడ్డాడు. గత వారం అరేహ్ మోహన్‌పోరా శాఖలో నియమించబడ్డాడు. అంతకుముందు అతను వైలూ కోకర్నాగ్ అనంత్‌నాగ్‌లో 10 రోజుల క్లుప్త కాలానికి పోస్ట్ చేయబడ్డాడు.

 
"కాశ్మీర్‌లో అతని మొదటి పోస్టింగ్ ఫిబ్రవరి 2019లో పహ్లూ కుల్గామ్‌లో జరిగింది," అని సహోద్యోగి చెప్పాడు, కుమార్ తన మూడేళ్ల సర్వీస్‌లో స్నేహపూర్వక వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కుమార్ ఫిబ్రవరి 10 న వివాహం చేసుకున్నాడు. తన వివాహానికి 20 రోజులు సెలవు తీసుకున్నాడు. మార్చిలో కశ్మీర్‌కు తిరిగి రాగా, అతని భార్య గత నెలలో జమ్మూ వచ్చింది.

 
"విజయ్ ఆమెను జమ్మూలో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. గత నెలలో ఈ జంట కుల్గామ్‌కు వెళ్ళారు. అప్పటి నుండి ఇద్దరూ అప్పర్ బజార్ ఖాజిగుండ్‌లోని అద్దె ఇంట్లో సంతోషంగా నివసిస్తున్నారు." అని అతని స్నేహితుడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments