కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

ఠాగూర్
సోమవారం, 20 అక్టోబరు 2025 (15:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులోని నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో రియాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా, సోమవారం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిందితుడు రియాజ్‌ను అరెస్టు చేసిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు తెలిపారు. 
 
మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించగా, ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాగివున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. రియాజ్‌ ఎన్‌కౌంటరులో చనిపోవడంతో ఇతర ఖాకీలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments