Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంచెష్టర్ మ్యాచ్‌లో భారత్ జోరు... రఫ్ఫాడిస్తున్న రోహిత్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (17:10 IST)
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా, ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మహాసంగ్రామంతో సమానంగా భావించే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రత్యర్థి బౌలర్లను సులభంగా ఎదుర్కొంటూ... పరుగుల వరద పారిస్తున్నారు.

ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహు్ల్ అర్థ సెంచరీ పూర్తిచేశాడు. మొత్తం 85 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఇది అతని వ్యక్తిగత వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ కాగా, ఈ ప్రపంచ కప్ టోర్నీలో రెండో సెంచరీ కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లను రోహిత్ శర్మ రఫ్ఫాడించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే మరోవైపు స్కోరు బోర్డుపై పరుగుల వరద పారించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ - రాహుల్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ 57 పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్‌కు అవకాశం ఇస్తూ, సెంచరీ పూర్తి చేసేలా సహకరించాడు. దీంతో రోహిత్ శర్మ తన కెరీర్‌లో 24వ సెంచరీని పూర్తి చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments