క్రికెట్ స్టేడియంలో విజయ్ మాల్యా.. ''దొంగ దొంగ'' అని అరిచిన జనం..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (12:19 IST)
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు లిక్కర్ కింగ్ మాల్యా వచ్చాడు. ఈ మ్యాచ్‌‌ను తిలకించేందుకు విజయ్ మాల్యా రావడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కర్ణాటకకు చెందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సంస్థను స్థాపించారు. విమాన సర్వీసులను కూడా నడిపారు. 
 
అయితే భారత బ్యాంకుల్లో 9వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని కేసు నమోదైంది. బ్యాంకులకు అనుకున్న మొత్తాన్ని చెల్లించకుండా.. లండన్‌కు పారిపోయిన మాల్యాను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఇంగ్లండ్ వద్ద అభ్యర్థిస్తూ వినతి పత్రాన్ని సమర్పించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు మాల్యా వచ్చాడు. ఆపై కొన్ని ఫోటోలకు మాల్యా ఫోజిచ్చాడు. ఆ సమయంలో మాల్యాకు తీరని అవమానం జరిగింది. అక్కడున్న ప్రజల్లో కొందరు హిందీలో ''దొంగ దొంగ'' అంటూ అరిచారు. దీంతో స్టేడియంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో విజయ్ మాల్యా అక్కడ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments