మాంచెష్టర్‌లో మంచు లక్ష్మి సందడి... వికెట్ కోల్పోయిన భారత్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (16:41 IST)
ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను తిలకించేందుకు భారత్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు విదేశాలకు వెళుతుంటారు. ఇలా టాలీవుడ్‌కు చెందిన నటి మంచు లక్ష్మి కూడా ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లింది. ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆమె ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానికి వెళ్లి సందడి చేశారు. భారత బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినపుడల్లా ఆమె త్రివర్ణ పతకాలను ఊపుతూ భారత ఆటగాళ్ళను ప్రోత్సహించారు. 
 
మరోవైపు, భారత తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద ఔటౌయ్యాడు. ఈయన మొత్తం 78 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేయగా, ఇందులో రెండు సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 24.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments