Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తాం : బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:58 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా, వచ్చే నెల రెండో తేదీన భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆల్‍‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ వెల్లడించారు. ఈ టోర్నీలో భాగంగా, ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాసన్ సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 
 
ఈ నేపథ్యంలో షకీబ్ హల్ హాసన్ స్పందిస్తూ, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందన్నారు. టైటిల్ ఫేవరెట్ టీమ్‌ ఇండియాపై గెలవాలంటే జట్టులోని ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందన్నారు. టైటిల్‌పై కన్నేసిన భారత్.. అగ్రశ్రేణి జట్టు. కోహ్లీ సేనను ఓడించడం అంత తేలిక కాదన్నారు. 
 
కానీ మా వంతు ప్రయత్నం చేస్తాం. శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే. ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించగలవారు టీమ్‌ ఇండియాలో చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. అయితే, తమ జట్టులోని ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారిని ఓడించగలిగే జట్టు మాకూ ఉందిఅని షకీబ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments