కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తాం : బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:58 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా, వచ్చే నెల రెండో తేదీన భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆల్‍‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ వెల్లడించారు. ఈ టోర్నీలో భాగంగా, ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాసన్ సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 
 
ఈ నేపథ్యంలో షకీబ్ హల్ హాసన్ స్పందిస్తూ, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందన్నారు. టైటిల్ ఫేవరెట్ టీమ్‌ ఇండియాపై గెలవాలంటే జట్టులోని ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందన్నారు. టైటిల్‌పై కన్నేసిన భారత్.. అగ్రశ్రేణి జట్టు. కోహ్లీ సేనను ఓడించడం అంత తేలిక కాదన్నారు. 
 
కానీ మా వంతు ప్రయత్నం చేస్తాం. శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే. ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించగలవారు టీమ్‌ ఇండియాలో చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. అయితే, తమ జట్టులోని ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారిని ఓడించగలిగే జట్టు మాకూ ఉందిఅని షకీబ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments