Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:14 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఓ ఓటమిని జీర్ణించుకోలేని అభిమాని ఒకరు టీవీ చూస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన పిచ్చి. దీంతో భారత ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తూ వస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాటం చేసినప్పటికీ.. 18 పరుగులు తేడాతో ఓడిపోక తప్పలేదు. ఎంతో ఉత్కంఠకు రేపిన ఈ మ్యాచ్‌ను చూస్తూ అతను టెన్షన్‌కు గురయ్యాడు. భారత ఓడిపోతుందని తెలియడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాముకు గుండెపోటు రావడంతో టీవీ ముందే కుప్పకూలిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ విగతజీవుడిగా మారిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి టీవీలో మ్యాచ్‌ను వీక్షించిన రాము... కొన్ని క్షణాల్లో తీరని లోకాలకు చేరుకోవడంతో గ్రామవాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments