Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ వీరాభిమానికి ధోనీ ఫిదా.. ఏం చేశాడో తెలుసా?

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (19:52 IST)
నిజానికి ఆయన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీరాభిమాని. పైగా, కరుడుగట్టిన పాకిస్థానీయుడు. ముఖ్యంగా, భారత్, పాకిస్థాన్ జట్లు ఎక్కడ తలపడుతున్నా అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు. మ్యాచ్ టిక్కెట్స్‌ను ఏదో విధంగా సంపాదించుకుని స్టేడియంలోకి ప్రవేశించి సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఆయన పేరు మొహమ్మద్ బషీర్. యూఎస్-పాక్ పౌరుడు. అలాంటి వ్యక్తికి భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా మారిపోయాడు. ఫలితంగా బషీర్‌కు అవసరమైన మ్యాచ్ టిక్కెట్స్‌ను ధోనీయే సమకూర్చుతుంటాడు. గత 2011 సంవత్సరం నుంచి ఈ టిక్కెట్లు సమకూర్చుతున్నాడు. 
 
ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం బషీర్ చికాగో నుంచి మాంచెష్టర్‌కు 6 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంతదూరం వెళుతున్న బషీర్ చేతిలో మాత్రం టిక్కెట్స్ లేవు. కానీ, మహేంద్ర సింగ్ ధోనీపై ఉన్న నమ్మకంతో బషీర్ అంతదూరం ప్రయాణించాడు. అతను అనుకున్నట్టుగానే బషీర్‌కు ధోనీ ఇండోపాక్ మ్యాచ్ టిక్కెట్లను సమకూర్చాడు. 
 
దీనిపై పీటీఐ వార్తా సంస్థతో ఈ అమెరికా పాస్‌పోర్టు వాసి అయిన బషీర్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కోసం ఒక రోజు ముందుగానే వచ్చాను. కానీ, ఒక టిక్కెట్ కోసం 800 నుంచి 900 పౌండ్ల మేరకు ఖర్చు చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. అంటే.. మాంచెష్టర్ నుంచి చికాగోకు తిరుగు ప్రయాణ టిక్కెట్‌ ధరతో ఇది సమానం. అయితే, తాను మాత్రం టిక్కెట్స్ కోసం ఎలాంటి శ్రమపడలేదని, ఇందుకోసం ధోనీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు 63 యేళ్ల పాక్-అమెరికా వాసి చెప్పుకొచ్చాడు. 
 
ధోనీకి బషీర్‌కు మధ్య 2011లో జరిగిన ప్రపంచ కప్‌లో స్నేహం ఏర్పడింది. ఈ వరల్డ్ కప్‌లో మొహాలీ వేదికగా ఇండోపాక్ మ్యాచ్ జరిగింది. అపుడు కూడా బషీర్‌కు ధోనీనే టిక్కెట్లు సమకూర్చాడు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా తాను ధోనీకి ఫోన్ చేయనని, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. కానీ, ఓ టెక్స్ట్ మెసేజ్ పంపుతా. దాన్ని చూసిన వెంటనే టిక్కెట్ సమకూర్చుతారని హామీ ఇస్తారని చెప్పారు. నిజంగా ధోనీ చాలా మంచి వ్యక్తి, మానవతావాది అని బషీర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments