Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ను జయించి, బంతిని దంచి కొట్టిన యువరాజసం

గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ తెలిదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక క్రికెట్‌లో ఆటను జయించడమే కాదు. ప్రాణాంతకమైన కేన్సర్‌ను కూడా జయించి మరీ మళ్లీ బరిలోకి దిగి తనను తాను ని

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (03:52 IST)
గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ తెలిదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక క్రికెట్‌లో ఆటను జయించడమే కాదు. ప్రాణాంతకమైన కేన్సర్‌ను కూడా జయించి మరీ మళ్లీ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకుని సమస్త క్రీడాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ధీరోదాత్తుడతడు.  

కేవలం తన శ్రమ, పట్టుదల, పోరాటతత్వంతో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అతడే యువీ అనే యువరాజ్ సింగ్. 17 ఏళ్ల క్రితం క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు తొలి ఇన్నింగ్స్‌లోనే ఆస్ట్రేలియా పని పట్టిన ఈ నవ యువకుడు తర్వాత ప్రపంచ క్రికెట్ క్రీడా యవనికలో అధిరోహించని శిఖరం లేదు. ఛేదించని రికార్డులు లేవు.
 
యువరాజ్‌ వన్డే కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఎన్నో మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని పంచాయి. కానీ ‘ఈ విజయం నాది’ అని అతను గర్వంగా చెప్పుకోగలిగే ప్రదర్శన మాత్రం 2011 వన్డే వరల్డ్‌ కప్‌లోనే. 28 ఏళ్ల తర్వాత భారత్‌ మళ్లీ ప్రపంచకప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర యువీదే. నాలుగు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’... ఇలా అన్నింటా యువీనే కనిపించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు, బౌలింగ్‌లో 15 వికెట్లతో అతను దుమ్మురేపాడు.  
 
ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల బాటలో ఉన్న సమయంలోనే తనకు క్యాన్సర్‌ వచ్చిందనే సంగతి యువరాజ్‌కు తెలుసు. కానీ తాను చనిపోయినా సరే, టోర్నీ మధ్యలో మాత్రం వెళ్లిపోనని అతను గట్టిగా చెప్పుకున్నాడు. చెన్నైలో వెస్టిండీస్‌తో సెంచరీ చేసిన మ్యాచ్‌లో రెండు, మూడు సార్లు అతను గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్నాడు. అయితే రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చికిత్స అనంతరం క్యాన్సర్‌ నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావించడమే పెద్ద సాహసం. కానీ అన్ని అవరోధాలను అధిగమించి యువీ భారత జట్టులోకి పునరాగమనం చేయడం పెద్ద విశేషం.
 
భారత అత్యుత్తమ వన్డే ఆటగాళ్లలో ఒకడైన యువరాజ్‌ గురువారం చాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోనుండటం విశేషం.     
 

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments