విండీస్ వెన్ను విరిచిన షమీ.. విజయానికి అతి చేరువలో టీమిండియా

రెండేళ్లుగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. 2015 వన్డే ప్రపంచ కప్ అనంతరం వెస్టిండీస్‌తో సీరిస్‌లో నాలుగో మ్యాచ్‌లో టీమిండియాలో అడుగుపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కాని గురువారం చివరి వన్డేలో మాత్రం చెలరేగిపోయాడు. విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు.

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (02:05 IST)
రెండేళ్లుగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. 2015 వన్డే ప్రపంచ కప్ అనంతరం వెస్టిండీస్‌తో సీరిస్‌లో నాలుగో మ్యాచ్‌లో టీమిండియాలో అడుగుపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కాని గురువారం చివరి వన్డేలో మాత్రం చెలరేగిపోయాడు. విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు. అతడి బౌలింగ్ పటిమ కారణంగా విండీస్ మళ్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. 48 పరుగులకు 4 విలువైన వికెట్లు తీసిన భారత పేసర్ మొహమ్మద్ షమీ చివరి మ్యాచ్‌లో హీరో. భారత్‌కు అతి తక్కువ విజయలక్ష్యాన్ని విధించిన విండీస్ జట్టు విజయంపై ఆశలు వదిలేసుకుంది.
 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్‌ (9), కైల్‌ హోప్‌ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో లూయిస్‌ను పాండ్యా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్‌ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్‌ హోప్‌.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ విండీస్‌కు షాక్‌ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్‌ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
 
ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్‌ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్‌ (16)ను కేదార్‌ జాదర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. ఈ దశలో షాయ్‌ హోప్, హోల్డర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్‌ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్‌ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్‌ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్‌ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్‌ వణికింది. హోల్డర్, షాయ్‌ హోప్‌ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్‌ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది.
 
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రహానే, కోహ్లీ, దినేష్ అద్భుత ప్రదర్శనతో విజయానికి దాదాపుగా చేరువలోకి వచ్చింది. కోహ్లీ సెంచరీకి చేరువకాగా, దినేష్ అర్ధ సెంచరీ బాటలో ఉన్నాడు. భారత్ మరో అద్భుత విజయానికి సమీపంలో ఉంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెతన్యాహుపై ఇరాన్ ఖైబర్ క్షిపణులతో మెరుపు దాడి చేసిందా? కార్యాలయం ధ్వంసమైందా?

బాచుపల్లి ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై దారుణం.. మత్తుమందిచ్చి లైంగిక దాడి

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

తర్వాతి కథనం
Show comments