Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌తో తేలిపోయాం.. నిజమే కానీ భారత్‌ పని మాత్ర పడతాం..సఫారీల అతిశయం

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ ఆటతీరుతో డక్‌వర్త్‌ లూయిస్‌ దెబ్బతో యధాప్రకారం ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. భారత్‌తో జరిగే చివరిలీగ్‌ మ్యాచ్‌లో తమ ప్రత్యేకత చూపిస్తామని శపథం చేసింది. ఆదివారం భారత్‌తో జరిగే పోరు తమకు చాలా కీలకమని, ఆ జట్టుపై గెలుపొ

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (05:46 IST)
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ ఆటతీరుతో డక్‌వర్త్‌ లూయిస్‌ దెబ్బతో యధాప్రకారం ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. భారత్‌తో జరిగే చివరిలీగ్‌ మ్యాచ్‌లో తమ ప్రత్యేకత చూపిస్తామని శపథం చేసింది. ఆదివారం భారత్‌తో జరిగే పోరు తమకు చాలా కీలకమని, ఆ జట్టుపై గెలుపొందేందుకు టీమంతా సమిష్టి ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటుందని దక్షిణాఫ్రికా జట్టు పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశజనక ఆటతీరు ప్రదర్శించిన తాము, భారత్‌తో మ్యాచ్‌లో తప్పకుండా అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
గత ఎనిమిది నెలలుగా జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొందని, అయితే బరిలోకి దిగిన ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించానని మోర్నీ మోర్కెల్‌పేర్కొన్నాడు. మరోవైపు ప్రొటీస్‌ కోచ్‌ రసెల్‌ డొమింగో తన జట్టును వెనకేసుకొచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో కెరీర్‌లో తొలిసారి మొదటి బంతికే డకౌటైన కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ను సమర్థించాడు. 
 
కెరీర్‌లో చాలా మంది తొలి బంతికే వెనుదిరిగే సందర్భం వస్తుందని, అయితే ఏబీకి ఇది జరగడానికి 200 వన్డేలకుపైగా సమయం పట్టిందని పేర్కొన్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఏబీ నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నామని, జట్టుకు అవసరమైన వేళ ఏబీ తప్పకుండా రాణిస్తాడని రసెల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
దక్షిణాఫ్రికా దురదృష్టమో... వాన వైపరీత్యమో కానీ... సఫారీ జయాపజయాల్ని ప్రతిసారీ  ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ కాలరాస్తోంది. గత 11 మ్యాచ్‌ల డీఎల్‌ ఫలితాల్లో 8 సార్లు జట్టు పరాజయాన్నే చవిచూసింది. 2015 నుంచి ఇప్పటి వరకు ‘డక్‌వర్త్‌’ తేల్చిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా గెలవలేకపోయింది.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments