కోహ్లీ మాట అశ్విన్ వినడం లేదా.. అందుకే పక్కన బెట్టారా? ఇద్దరికీ ఎక్కడ బెడిసింది?

అనారోగ్యం కారణం వల్ల కాకుండా టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ ఆడకుండా ఉన్న టోర్నీలు, మ్యాచ్‌లు ఎప్పుడైనా లెక్కించారా? బహుశా ఈ విషయంలో అశ్విన్ మీకు దొరికి ఉండడు. ఆశ్చర్యం ఏమిటంటే పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (09:42 IST)
అనారోగ్యం కారణం వల్ల కాకుండా టీమిండియాలో  రవిచంద్రన్ అశ్విన్ ఆడకుండా ఉన్న టోర్నీలు, మ్యాచ్‌లు ఎప్పుడైనా లెక్కించారా? బహుశా ఈ విషయంలో అశ్విన్ మీకు దొరికి ఉండడు. ఆశ్చర్యం ఏమిటంటే పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో జట్టు ప్రధాన ఆటగాడు అశ్విన్‌నే పక్కన పెట్టిన వైనం టీమిండియా అభిమానులను దిగ్భ్రాంతి పరుస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు  తుది జట్టులో చోటు లభించలేదు. తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా అశ్విన్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. 
 
ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. జట్టుకు వెన్నెముకగా ఉన్న అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు. తుదిజట్టులో స్థానం దక్కకపోవడాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పు సమీకరణాలను అశ్విన్‌ అర్థం చేసుకోగలడని కోహ్లి మీడియాతో పేర్కొన్నాడు. 
 
‘అశ్విన్‌ టాప్‌ క్లాస్‌ బౌలర్‌. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్‌ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వుం ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది’  అని కోహ్లి వివరించాడు.
 
అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కోహ్లి అంగీకరించాడు. అయితే, ఇవి మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే కానీ, జట్టు సెలెక‌్షన్‌ విషయంలో ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని చెప్పాడు. ‘ఔను, మా మధ్య బౌలింగ్‌ ప్లాన్స్‌, ఇతరత్రా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. సొంత ప్లాన్స్‌తో మైదానంలోకి అడుగుపెడతాడు. అందువల్ల ఇలాంటి విభేదాలు వస్తుంటాయి’ అని వివరించాడు.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments