Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభించిన భారత్ ఆటగాళ్లు: భారత్ భారీ స్కోర్

Webdunia
రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు విజృంభించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ అర్థశతకాలతో భారత్‌కు శుభారంభం చేశారు.

అనంతరం బరిలోకి దిగిన రైనా అర్థశతకాన్ని చేజార్చుకున్నప్పటికీ 43 పరుగులు చేశాడు. మొత్తానికి ముగ్గురు భారత్ ఆటగాళ్లు అర్థశతకాన్ని నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా... ఫోర్ల మోతతో భారత్‌కు భారీ స్కోరును సంపాదించి పెట్టారు.

ఇందులో భాగంగా.... వీరూ.. పది ఫోర్లు, గంభీర్ 8, యువరాజ్ సింగ్ 16 ఫోర్లు, ఇషాంత్ శర్మ (1), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండు ఫోర్లు కొట్టారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ 39 పరుగులకే హార్మిసన్ బౌలింగ్‌తో ఇంటి ముఖం పట్టాడు.

నడుంనొప్పితో బరిలోకి దిగిన యువరాజ్ సింగ్ భారత్ జట్టుకు భారీ స్కోరును సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పఠాన్, ధోనీ, ఇషాంత్ శర్మల భాగస్వామ్యంతో ఏకధాటిగా శతకం దాటాడు. మొత్తానికి 78 బంతుల్లోనే, 16 ఫోర్లతో 138 పరుగులు చేశాడు. మొత్తానికి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల పతనానికి భారత్ 387 పరుగులు చేసింది.

భారత్ ఆటగాళ్లలో గంభీర్ (51 పరుగులు), సెహ్వాగ్ (85), సురేష్ రైనా (43), ధోనీ (39), ఇషాంత్ శర్మ (11) పరుగులు చేశారు. 138 పరుగులతో శతకం దాటిన యువరాజ్ సింగ్, శర్మలు నాటౌట్‌గా నిలిచారు. యూసఫ్ పఠాన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. దీనితో ఇంగ్లండ్‌ విజయలక్ష్యంగా భారత్ 387 పరుగులను నిర్దేశించింది.

ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్లింటాఫ్ ఒకటి, ఎస్.జె. హార్మిసన్ రెండు వికెట్లు, ఎస్.ఆర్. పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

Show comments