Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-కివీస్ చివరి టెస్టుకు వర్షం అడ్డంకి తప్పదా..?

Webdunia
FILE
భారత్-న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో జరిగిన తొలి రెండు టెస్టులు గెలుపోటములు లేకుండా డ్రా గా ముగిసిన నేపథ్యంలో, మూడో టెస్టుకు వరుణభగవానుడిచే అంతరాయం తప్పేలాలేదు.

నాగ్‌పూ‌ర్‌లో శనివారం జరుగనున్న కీలక చివరి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. గురువారం కురిసిన భారీ వర్షంతో మైదానమంతా చిన్నపాటి కొలనుగా దర్శనమిస్తోంది. దీంతో వర్షం ధాటికి టీమ్ ఇండియా ప్రాక్టీస్‌కు బ్రేక్ పడింది.

సాయంత్రం కురిసిన వర్షం ధాటికి ధోనీ సేన హోటల్ గదులకే పరిమితమైంది. ఉదయం పూట వాతావరణం పొడిగానే ఉండడంతో న్యూజిలాండ్ ప్రాక్టీస్ సెషన్ నిర్విఘ్నంగా సాగింది. మరోవైపు మరో వారంపాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతుండటంతో కీలక చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచిఉంది.

ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఆడినప్పుడల్లా భారత్‌ ప్రధానంగా ఆధారపడేది స్పిన్ బౌలింగ్‌పైనే. తొలి రెండు టెస్టుల్లో పిచ్‌లు అనుకూలించకపోవడంతోనే డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మొతేరా, ఉప్పల్‌లాంటి పిచ్‌లపై 10 రోజులాడినా వేస్టేనని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
FILE


పక్కా ఫ్లాట్‌పిచ్‌ల చలవతో రెండు టెస్ట్‌లను డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మన స్పిన్ ద్వయం హర్భజన్, ప్రజ్ఞాన్ ఓఝాలు వికెట్లు పడగొట్టడంలో చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. భజ్జీ 50 సగటుతో కేవలం 6 వికెట్లే పడగొట్టగా, ఓఝాకు 7 వికెట్లు దక్కాయి.

ఇకపోతే.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రెండూ డ్రాగా ముగియడంతో తాజాగా అందరి దృష్టి శనివారం నుంచి జరిగే నాగపూర్ టెస్ట్‌పై నిలిచింది. సిరీస్ ఫలితం తేల్చేక్రమంలో నాగపూర్ వికెట్ బౌలర్లకు సహకరించాలని ధోనీ కోరుకుంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments