Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా: 338/4

Webdunia
ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట రసవత్తరంగా మారింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. క్రీజులో మైఖేల్ క్లార్క్ (21), వాట్సన్ (4)లు ఉన్నారు. మూడో రోజు ఆటలో అసీస్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో భారత్‌ బౌలర్లు విఫలమయ్యారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ధీటుగా స్పందించిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే భారత బౌలర్లపై దాడికి దిగింది. మూడో రోజు ఉదయం స్పిన్ తిరుగుతుందని భావించిన భారత్‌కు కాస్తంత నిరాశే ఎదురైందని చెప్పాలి.

మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ముందు కటిచ్‌ (64) ఔటయ్యాడు. మిశ్రా వేసిన బంతిని ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వికెట్లు పడటమే కష్టమయింది.

రికీ పాంటింగ్, హస్సీలు ఆచితూచి ఆడుతూ అడపాదడపా ఫోర్లు కొడుతూ ప్రమాదకరంగా మారారు. దీంతో మళ్లీ రంగంలోకి సెహ్వాగ్‌ బౌలింగ్‌‌కు దిగి రికీ పాంటింగ్‌ (87)ను వెనక్కి పంపాడు. మరి కొద్ది సేపటికి హస్సీను (53) కూడా పెవిలియన్ దారి పట్టించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments