Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టెస్ట్: నిలకడగా రాణిస్తున్న ఓపెనర్లు

Webdunia
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 59, విజయ్ 37 పరుగులతో రాణిస్తున్నారు. దీంతో మ్యాచ్ నాలుగో రోజు తొలి సెషన్స్‌కు భారత్ వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 86 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 184 పరుగుల ఆధిక్యం లభించింది.

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 355 పరుగులు చేసింది. భారత జట్టులో సచిన్ 109 పరుగులు చేయగా, ఆసీస్ జట్టులో ఓపెనర్ కటిచ్ 102 పరుగులు చేసిన విషయం తెల్సిందే. కాగా, మూడో రోజు ఆస్ట్రేలియా జట్టు 355 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆడింది. పరుగులు ఏమీ చేయలేదు.

నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. సెహ్వాగ్ ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆ క్రమంలో 76 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే విజయ్ కూడా 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో లంచ్ సమయానికి భారత్ 98 పరుగులు చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments