Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటక్ వన్డే : విజృంభించిన భారత ఓపెనర్లు

Webdunia
బుధవారం, 26 నవంబరు 2008 (20:35 IST)
ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు విజృంభించి అర్థ సెంచరీలు సాధించడంతో ఇంగ్లాండ్ విధించిన 271 పరుగుల విజయలక్ష్యాన్ని సులభంగా చేధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీంతో ప్రస్తుతం భారత్ 21 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 140 పరుగుల వద్ద కొనసాగుతోంది.

ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (82), యువరాజ్ సింగ్ (4)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హార్మిసన్ ఓ వికెట్ తీసుకున్నాడు. లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా సెహ్వాగ్ విజృంభించడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి.

వేగంగా పరుగులు సాధించే దిశగా సెహ్వాగ్ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అయితే అర్థ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న సచిన్ (50)ను హార్మిసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments