Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : విరాట్ కోహ్లీ - భువనేశ్వర్‌లకు చోటు!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:59 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకుల పట్టికలో భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలోనూ, బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌లు ఏడో స్థానంలో ఉన్నారు. 
 
అయితే, బ్యాటింగ్ విభాగంలో సఫారీ స్టార్ ఏబీ డీవిలీర్స్ అగ్రస్థానం పదిలపరుచుకోగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఏబీకి కోహ్లీకి మధ్య 25 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. మూడోస్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా నిలిచాడు. ఇక, బౌలింగ్ విభాగంలో భారత యువ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ స్థానం ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. 
 
ఈ జాబితాలో, సస్పెన్షన్‌కు గురైన పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండో ర్యాంకులో, సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నాలుగోస్థానంలో నిలిచాడు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments