Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌తో సహా ఏడుగురి పేర్లు.. సుప్రీం వెల్లడి

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (19:34 IST)
భారత్ క్రికెట్‌ను ఒక కుదుపు కుదుపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్‌‌ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో 13 పేర్లకు గాను ఏడు పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది.
 
భారత క్రికెట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్న ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై జస్టీస్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని ఈ పేర్లను వెల్లడించింది. 
 
ఈ నివేదికలో మొత్తం 13 మంది పేర్లు ఉండగా, వారిలో ఏడుగురు పేర్లను వెల్లడించింది. ఇందులో ఇందులో ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ(భారత్), ఓవైషా (ఇంగ్లాండ్), శామ్యూల్ బాడ్రీ (వెస్టిండిస్), బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, మాజీ ఐపీఎల్ ఆఫీసర్ సుందర్ రామన్‌ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24కు తేదీకి వాయిదా వేసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments