Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజాపై ఐసీసీ యాక్షన్ : మ్యాచ్ ఫీజులో 50% కోత!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (16:14 IST)
భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ ప్లేయర్ అండర్సన్‌తో జడేజా గొడవ పడిన విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫీజు కోత విధించింది. రవీంద్ర జడేజా ఐసీసీ కోడ్ లెవెల్ -1 అతిక్రమించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
 
తొలిటెస్టులో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌తో వాగ్వివాదం నెరిపిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. లార్డ్స్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న జడేజాను ఉద్దేశించి ప్రేక్షకులు అవహేళన చేశారు.
 
దీనిపై రాహుల్ ద్రావిడ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు జడేజాను గేలి చేయడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్నాడు. తొలి టెస్టులో చోటు చేసుకున్న వివాదం గురించి వారికేం తెలుసని ద్రావిడ్ ప్రశ్నించాడు. అయితే ఆండర్సన్‌తో వాదనకు దిగడంతో జడేజాపై ఐసీసీ సీరియస్ కాక తప్పలేదని టాక్. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments