Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జట్టుతో ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఆశించొద్దు : రవిశాస్త్రి

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (16:31 IST)
భారత క్రికెట్ జట్టు టీమ్ డైరక్టర్‌గా నియమితులైన భారత క్రికెట్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ రవిశాస్త్రి స్పందిస్తూ భారత క్రికెట్టుతో ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఆశించవద్దన్నారు. ప్రస్తుతం తాను ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైవున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం భారత ఆటగాళ్ళలో స్థైర్యాన్ని నింపడమేనన్నారు. అలాగే, భవిష్యత్‌పై ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు. ప్రస్తుతం కోచ్ ఫ్లెచర్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. లార్డ్స్‌ క్రికెట్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఎలా ఓడిపోయిందన్న అంశానికి సంబంధించి కారణాలు కనుగొనాల్సి ఉందన్నారు. 
 
కాగా, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. సిరీస్‌ను 3-1తో కోల్పోయిన విషయం తెల్సిందే. తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో బీసీసీఐ జట్టు టీమ్‌లో పేను మార్పులకు శ్రీకారం చుట్టింది. 

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments