ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను గురువారం తుదిశ్వాస విడిచాడు. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.
ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం.