Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ లీగ్ టీ-20 : సెమీస్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్

Webdunia
ఆదివారం, 28 సెప్టెంబరు 2014 (17:04 IST)
స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా గ్రూపు - ఏ విభాగంలో పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. సెమీస్ రేసులో నిలవాలంటే విజయం తప్పనిసరైన తరుణంలో ధోనీ సేన ఘనం విజయం సాధించి రేసులో నిలిచింది. 
 
శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగులతో అద్భుత విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పెర్త్‌ ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు 142 రన్స్‌ మాత్రమే చేసింది. కల్టర్‌ నైల్‌ (30) కెప్టెన్‌ ఆడమ్‌ వోజెస్‌ (27), ఆస్టన్‌ టర్నర్‌ (22) రాణించినా ఫలితం దక్కలేదు. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 155 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (28 బంతుల్లో 44 నాటౌట్‌), కెప్టెన్‌ ధోనీ (16 బంతుల్లో 4 సిక్సర్లతో 35), డ్వేన్‌ బ్రావో (27) రాణించారు. జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments