Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్‌కు సంబంధం లేదు.. కానీ..?

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (10:57 IST)
ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
 
శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా చట్ట వ్యతిరేకమైన బెట్టింగుకు పాల్పడ్డట్లు పేర్కొంది. ఐపీఎల్ సీఓఓ రామన్‌కు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు తేల్చింది.
 
అలాగే, విచారణకు అతను ఆటంకం కలిగించలేదని పేర్కొందని అంటూ నివేదికలోని కొన్ని అంశాలను బయటపెట్టింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన బోర్డు కీలక వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)పై నిర్ణయాన్ని తీసుకోవడానికి మంగళవారం పాలక మండలి సమావేశం కానున్న నేపథ్యంలో ఫిక్సింగ్ కేసులో శ్రీని పాత్ర లేదని ముద్గల్ కమిటీలో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు ప్రకటించడం విశేషం.
 
దీనితో మరోసారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఇప్పటి వరకూ శ్రీనివాసన్‌కి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments