Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్, కోహ్లీ బాటలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ!

Webdunia
మంగళవారం, 7 అక్టోబరు 2014 (10:37 IST)
క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాదిరిగానే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒక సాకర్ క్లబ్‌లో భాగస్వామిగా మారాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పోటీపడనున్న చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌లో సహభాగస్వామి అయ్యాడు. 
 
ఇప్పటికే ఈ క్లబ్‌లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భాగస్వామి. తాజాగా ధోనీ ఒప్పందంపై సంతకం చేసినట్టు క్లబ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. గోవా ఫుట్‌బాల్ క్లబ్‌లో విరాట్ కోహ్లీ, కేరళ బ్లాస్టర్స్ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్, అట్లెటికోడి కోల్‌కతా క్లబ్‌లో సౌరవ్ గంగూలీ ఇప్పటికే భాగస్వాములయ్యారు. 
 
ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటా తీసుకున్న క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు ధోనీ కూడా చేరాడు. ఫుట్‌బాల్‌ను ఎంతో ఇష్టపడే అతను సమయం దొరికితే చాలు బంతిని తీసుకొని మైదానానికి పరుగులు తీస్తాడు. జట్టు ప్రాక్టీస్ సమయంలోనూ వ్యాయామానికి ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడతాడు. అదే ఇష్టంతో ఇప్పుడు సాకర్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నాడు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments