ఇంగ్లండ్లోని నాటింగ్ హామ్లో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. కుక్ 44, హాల్స్ 42, బుట్లర్ 42, ట్రెడ్ వెల్ 30, బెల్ 28 రాణించారు.
వోక్స్ 15, మోర్గాన్ 10, ఫిన్ 6, రూట్ 2, స్టోక్స్ 2 పరుగులు చేశారు. 227 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో... భారత్ విజయ లక్ష్యం 228 పరుగులు. అశ్విన్ 3 వికెట్లు తీయగా, కుమార్, సామి, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్ తీశారు.
టీమిండియా బౌలర్లు బౌలింగ్, ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించడంతో మూడో వన్డేలో టీమిండియా పైచేయి సాధించింది. తేమగా ఉన్న పిచ్పై టీమిండియా పార్ట్ టైమర్లు, స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్మన్ను కట్టడి చేశారు.
ఇంకా ఇతర విశేషాలను మీ మొబైల్లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.