Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ లీగ్ 20 : కోల్‌కతా నైట్ రైడర్స్ ఫోర్త్ విన్!

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (12:32 IST)
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్‌ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్‌), మనీష్‌ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్‌)తో చెలరేగి ఆడటంతో కోల్‌కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
తొలుత కోల్‌కాతా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత 188 పరుగుల లక్ష్య ఛేదనలో డాల్ఫిన్స్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. సునీల్‌ నరైన్‌ (3/33), యూసుఫ్‌ పఠాన్‌ (2/25) డాల్ఫిన్స్‌ పతనాన్ని శాసించారు. డాల్ఫిన్స్‌ నాలుగు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఊతప్ప ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఇక అక్టోబర్‌ 2న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న తొలి సెమీస్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌తో కోల్‌కాతా తలపడనుంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments