Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు కపిల్ - నేడు ధోనీ : లార్డ్స్‌లో రవీంద్ర జడేజా క్రీడాస్ఫూర్తి

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (18:11 IST)
ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన మొదటి టెస్టు సమయంలో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, లార్డ్స్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జడెజా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. భారత్ గెలిచిన వెంటనే అక్కడే ఉన్న అండర్స్‌తో జడెజా చేయి కలిపాడు.
 
కాగా, జడెజా, అండర్సన్ గొడవకు సంబంధించి వీడియో ఆధారాలు లేవట. నాడు కపిల్.. నేడు ధోనీ లార్డ్స్‌లో భారత్ ఇంతకుముందు 16 మ్యాచులు ఆడింది. అందులో గెలిచింది ఒక్కటే. ఇప్పుడు 17వ మ్యాచ్ ధోనీ సారథ్యంలో గెలిచింది. 28 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ సారథ్యంలో చారిత్రక లార్డ్స్ గెలిచిన భారత్, మళ్లీ ఇప్పుడు గెలిచింది. 
 
1986లో జూన్ 5-10 తేదీల మధ్య జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 294 పరుగులు చేయగా.. భారత్ 341 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 180 పరుగులకు కుప్పకూలగా, 134 పరుగుల లక్ష్యాన్ని కపిల్ సేన 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
కాగా, లార్డ్స్‌లో భారత్ గెలుపులో ఇషాంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇషాంత్ 7 వికెట్లు తీసి 74 పరుగులు చేశాడు. ఇషాంత్‌కు ఓ టెస్టులో ఇదే అత్యుత్తమ ప్రతిభ. 
 
లార్డ్స్‌లోను ఓ భారత బౌలర్ అత్యుత్తమ గణాంకాలు ఇవే. 2005లో ఇర్ఫాన్ హరారేలో 7/59 తర్వాత ఓ భారత పేసర్ ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. విజయంపై ధోనీ హర్ష్యం వ్యక్తం చేశాడు. లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని సాధించామని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.
 
2011 టూర్‌లో ఎదురైన పరాభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయని మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని ధోనీ ప్రశంసించాడు. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments