భారత క్రికెట్ జట్లు ఇంగ్లండ్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ సేన దారుణ ప్రదర్శనలతో పరాజయాల బాటలో నడుస్తుండగా, మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసింది.
వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు చేయగా, భారత్ 114 పరుగులు నమోదు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 202 పరుగులు చేయగా... మిథాలీ సేన 4 వికెట్లు కోల్పోయి 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది.
కెప్టెన్ మిథాలీరాజ్ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించడం విశేషం. ఈ విజయాన్ని చూసైనా టీమిండియా మేల్ స్టార్లు ఓవల్లో చెలరేగితే బాగుంటుందని క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.