Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు: శిఖర్ ధావన్ ప్లేసులో గంభీర్?

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (15:15 IST)
ఇంగ్లీష్ పిచ్‌లపై టీమిండియా స్టార్ బ్యాట్స్‌‌మన్ శిఖర్ ధావన్ తడబడుతుండటాన్ని జట్టు మేనేజ్‌మెంట్ గుర్తించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియాలో మార్పులు చేర్పులు చేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ప్లేసులో గౌతం గంభీర్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. 
 
అదే జరిగితే, మురళీ విజయ్ జతగా గంభీర్ సౌతాంప్టన్ టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. 2011లో ఇంగ్లండ్ టూర్లో భారత్ జట్టు ఘోర వైఫల్యాలు చవిచూడగా, అప్పుడు గంభీర్ కూడా జట్టులో ఉన్నాడు. ఇటీవల దేశవాళీ పోటీల్లో రాణింపు గంభీర్‌కు మళ్ళీ టీమిండియాలో చోటు సంపాదించి పెట్టింది. ప్రస్తుత టూర్‌కు ఈ ఢిల్లీ క్రికెటర్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు సౌతాంప్టన్‌లో ఈనెల 27న ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు డ్రా కాగా, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించినట్లైంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments