Webdunia - Bharat's app for daily news and videos

Install App

లార్డ్స్‌ టెస్టులో భారత్ ఘన విజయం.. నరేంద్ర మోడీ ట్వీట్స్

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (13:01 IST)
క్రికెట్ మక్కాగా ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో ప్రశంసలజల్లు కురిపించారు. భారత్ అద్భుతమైన విజయం సాధించిందని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. టీమిండియా అద్భుత విజయం సాధించింది. మీ స్ఫూర్తిదాయక విజయం చూసి దేశం గర్విస్తోంది. ప్రతి భారతీయుడు సంతోషించదగ్గ విజయమిది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 
 
అలాగే, సుప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఈ చారిత్రక విజయంపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ భారత జట్టు గెలుపు తననెంతో ఉద్విగ్నతకు గురిచేసిందని తెలిపారు. విక్టరీ క్రెడిటంతా జట్టు మొత్తానికీ వర్తిస్తుందని పేర్కొన్నాడు. విజయానికి ఏ ఒక్కరో కారకులని తాను చెప్పబోనన్నారు. ఇది సమష్టి కృషి అని అభినందించారు. 
 
ఇది ప్రారంభమేనని, సాధించాల్సింది ఎంతో ఉందని టీమిండియా సభ్యులకు సూచించాడు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అనంతరం యువకులతో కూడిన టీమిండియాకు ఇంగ్లండ్ పర్యటన సవాల్ వంటిదని పాటిల్ పేర్కొన్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments