Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ తుఫానుతో భారీ వర్షాలు.. 14న విశాఖ వన్డే అనుమానమే!

Webdunia
ఆదివారం, 12 అక్టోబరు 2014 (14:52 IST)
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఈనెల 14వ తేదీన భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్‍‌ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. నిజానికి హుదూద్ తుఫాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటినా, మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ వన్డే నిర్వహణ అసాధ్యంగా మారింది. 
 
హుదూద్ తుఫాను తీరం దాటడంతో విశాఖపట్నం భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఉప్పెన అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా, అక్టోబర్ 14వ తేదీన విశాఖలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. తుఫాను కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ కారణంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాదని బ్రాడ్ కాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ వెళ్ళడం సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. వేదికను మార్చాలని ఆశిస్తున్నామని, అయితే, ఇంతవరకు ఏ విషయం తెలియరాలేదని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments