Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ చెప్పింది సత్యము... ఛాపెల్ నాశనం చేశాడు... భజ్జీ మద్దతు

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (19:36 IST)
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్‌పై సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో తెలిపిన విషయాలకు మద్దతుగా సహచర సభ్యులు భజ్జీ, జహీర్ ఖాన్ గొంతు విప్పారు. ఇప్పటికే ఛాపెల్ వ్యవహార సరళిపై గంగూలీ వ్యాఖ్యానించగా, తాజాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ కూడా ఆరోపణలు చేశారు. కోచ్‌గా ఛాపెల్ తన పరిమితులను అతిక్రమించాడని భజ్జీ పేర్కొన్నాడు. జహీర్ మాట్లాడుతూ, తాను కోచ్‌గా ఉండగా ఎలా ఆడతావో చూస్తానంటూ ఛాపెల్ తనను బెదిరించాడని తెలిపాడు.
 
ఛాపెల్ భారత జట్టును సర్వనాశనం చేశాడని, అది తిరిగి కోలుకోడానికి మూడేళ్ల సమయం పట్టిందని అన్నాడు. కొంతమంది గుడ్డిగా ఛాపెల్ చెప్పిన మాట వినేవాళ్లని, దానివల్ల తాము బాగా ఎదిగిపోతామని భావించారని తెలిపాడు. కానీ అలా చేయడంతో భారత క్రికెట్ ఎంత పతనం అవుతుందన్న విషయం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందాడు.
 
హర్భజన్ మరో విభ్రాంతికర విషయం కూడా బయటపెట్టాడు. జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. నాటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ గురించి బీసీసీఐకి ఓ ఈమెయిల్ కూడా రాశాడని తెలిపాడు. గంగూలీ అప్పుడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని, అలాంటి సమయంలో డ్రసింగ్ రూంలో కూర్చుని మరీ ఈమెయిల్ పెట్టాడని చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments