భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు సెలవులు దొరికాయి. సచిన్ పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడం తెలిసిందే. దీనిపై సచిన్ వివరణ ఇచ్చాడు కూడా. ఈ క్రమంలో ఆయన తాజా సమావేశాలకు హాజరు కాలేనని రాజ్యసభ చైర్మన్కు అభ్యర్థన లేఖ పంపారు.
కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా తనకు సెలవు మంజూరు చేయాలని లేఖలో సచిన్ కోరారు. సచిన్ విజ్ఞప్తిని పరిశీలించిన రాజ్యసభ చైర్మన్ సెలవుకు ఆమోదముద్ర వేశారు. పెద్దన్న అజిత్కు బైపాస్ సర్జరీ కారణంగా తాను సమావేశాలకు హాజరుకాలేకపోయానని సచిన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.