Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాంఫ్టన్ టెస్ట్ : బ్యాలెన్స్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

Webdunia
సోమవారం, 28 జులై 2014 (10:13 IST)
సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఆ జట్టు కెప్టెన్ కుక్ (95), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాలెన్స్ (104 నాటౌట్) సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 
 
వరుసగా బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఈ మ్యాచ్‌తో సత్తా చాటాడు. 95 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్ రాబ్సన్ (26) ఔటైనప్పటికీ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ తడబడకుండా స్కోరు పెంచారు. అనంతరం బ్యాలెన్స్ (104 నాటౌట్), బెల్ (16 నాటౌట్) సమయోచితంగా ఆడి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత బౌలర్లలో జడేజా, షమీలకు చెరో వికెట్ దక్కింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments