Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:27 IST)
వెస్టిండీస్ పర్యటన అర్థాంతరంగా ముగియడంతో దాని స్థానంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందుకోసం వేదికలతోపాటు.. జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ఖరారు చేసింది. ఆ ప్రకారంగా లంకతో జరిగే వన్డే సిరీస్‌‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ ధోనీకి ఈ మూడు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించారు. 
 
ఈ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. తొలి మూడు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు వీరే... కోహ్లీ (కెప్టెన్), ధావన్, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.
 
అలాగే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల కోసం వేదికలను కూడా ఖరారు చేసింది. ఆ ప్రకారంగా కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో వన్డే మ్యాచ్‌లను నిర్వహిస్తారు 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments