Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్: 408 పరుగులకు టీమిండియా ఆలౌట్!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (11:22 IST)
బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 408 పరుగులకు ఆలౌటైంది. 311/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ చివరి 6 వికెట్లను త్వరితగతిన చేజార్చుకుంది. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పేసర్ హాజెల్ ఉడ్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆఫ్ స్పిన్నర్ లియాన్ 3 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
 
కాగా అంతకుముందు బ్రిస్బేన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ (144) సెంచరీ సాధించగా, వరుసగా రెండో టెస్టులోనూ శిఖర్ ధావన్ (24) నిరాశపరిచాడు. ఛటేశ్వర్ పుజారా(18) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 
 
తొలి టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ (19) రెండో టెస్టులో విఫలమయ్యాడు. అజింక్యా రహానే (75), రోహిత్ శర్మ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్ బౌలర్ జోష్ హాజెల్ ఉడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments