Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయుడి బిర్యానీ తినడానికి ధోనీ హోటల్ మారాడు!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:41 IST)
ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో భాగంగా హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ లీగ్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేశారు. ధోనీతో సన్నిహితంగా మసలే యువ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు ఈ సందర్భంగా భారత కెప్టెన్‌కు హోమ్లీ ఆతిథ్యం ఇవ్వాలని భావించాడు. 
 
ధోనీ కోసమని తన ఇంట్లో బిర్యానీ చేయించి, దాన్ని కాకతీయ హోటల్‌కు పట్టుకొచ్చాడు. అయితే, కాకతీయ హోటల్ నిబంధనలు మరోలా ఉన్నాయి. అక్కడ బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతించరట. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది రాయుడికి చెప్పగా, రాయుడు ఈ సంగతి ధోనీకి వివరించాడు. దీంతో, ఒళ్ళు మండిన ధోనీ వెంటనే హోటల్ షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేసి... తాజ్ కృష్ణాకు మకాం మార్చాడట. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా సమర్థించినట్టు సమాచారం.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments