Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 గంటల పాటు మోడీని విచారించిన ఐటీ అధికారులు!

Webdunia
PTI
కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంపై ఐటీ శాఖకు చెందిన అధికారులు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీని 8 గంటల పాటు విచారించారు. కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇంకా డబ్బుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఐటీ శాఖకు సమాచారం అందింది. దీంతో ఐపీఎల్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ వద్ద ఐటీ శాఖాధికారులు 8 గంటల పాటు విచారణ జరిపారు. ఐపీఎల్ ద్వారా వచ్చే నగదు, వాటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా డాక్యుమెంట్లు, ఫ్రాంచైజీ వివరాలపై దర్యాప్తు జరిపారు.

వాఖండే స్టేడియంలోని ఐపీఎల్ హెడ్-క్వార్టర్స్ మరియు మోడీ కార్యాలయం నిర్లోన్ హౌస్‌లోనూ ఐటీ దాడులు జరిగాయి. గురువారం రాత్రి 7.15 నుంచి తెల్లవారుజాము 3.20 గంటల వరకు జరిగిన లలిత్ మోడీ వద్ద ఐటీ అధికారులు విచారణ జరిపారు.

ఈ విచారణ అనంతరం లలిత్ మోడీ విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులకు పూర్తి వివరాలను అందజేశామని చెప్పారు. ఇంకా అధికారుల విచారణకు పూర్తి సహకారం అందించామని మోడీ స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ వివరాలు, వాటి బిడ్ అంశాలను డాక్యుమెంట్లతో అధికారుల ముందుంచామని లలిత్ మోడీ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments