Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్ టెస్ట్: 520 పరుగులకు భారత్ ఆలౌట్

Webdunia
న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 520 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌పై టీం ఇండియాకు 241 పరుగుల ఆధిక్యం సాధించినట్లైంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇకపోతే.. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 242 పరుగులు జోడించి, మిగతా వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (260 బంతుల్లో 26 ఫోర్లతో 160 పరుగులు) ధీటుగా రాణించి, మరో శతకాన్ని సాధించాడు. సచిన్ తర్వాత టీం ఇండియా ఆటగాళ్లలో గౌతం గంభీర్ 72 పరుగులు చేసి శతకాన్ని చేజార్చుకున్నాడు.

లోయర్ ఆర్డర్‌లో ఆడిన జహీర్ ఖాన్ అర్థసెంచరీని ( 46 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు) నమోదు చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో రాణించిన సెహ్మాగ్ 24 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. ఇదేవిధంగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 47 పరుగులు మాత్రమే చేసి అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ (33), యువరాజ్ సింగ్ (22), హర్భజన్ సింగ్ (16), ఇషాంత్ శర్మ (6), మునాఫ్ పటేల్ (9) పరుగులు చేశారు.

కివీస్ బౌలర్లలో మార్టిన్, ఒబ్రియాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా, వెటోరి రెండు, మిల్లిస్ ఒక వికెట్ సాధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments