Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్ టెస్ట్: 279 పరుగులకు కివీస్ ఆలౌట్

Webdunia
హామిల్టన్‌లోని సెడెన్‌ పార్కులో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు కీపర్ మెక్‌మిల్లన్ (84) టెయిల్ ఎండ్‌ల సాయంతో కొద్ది సేపు ప్రతిఘటించినప్పటికీ భారత బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. దీంతో ఆ జట్టు 102.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 39 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

అంతకుముందు కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా 279 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. అయితే, భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 520 పరుగులు చేయడంతో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ ఆధిక్యమే టీమ్ ఇండియా తొలి టెస్టు విజయానికి కీలకంగా ఉపయోగపడింది.

కాగా, కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డేనియర్ వెటోరి (118), రైడర్ (102) పరుగులతో రాణించి, జట్టును ఆదుకున్నారు. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ వీరిద్దరి వీరోచిత ఇన్నింగ్స్ ఫలితంగా కోలుకుంది. ఆ తర్వాత భారత్ ధీటుగా సమాధానం ఇవ్వడంతో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.

భారత ఇన్నింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 160 పరుగులు చేసి టెస్టుల్లో 42వ సెంచరీని పూర్తి చేశాడు. అలాగే జహీర్ ఖాన్ (51), ధోనీ (47), ద్రావిడ్ (66), లక్ష్మణ్ (30) పరుగులతో రాణించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments