Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్లో ఓవర్ రేటు: ముంబై ఇండియన్స్‌పై భారీ జరిమానా

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుపై రెండోసారి ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌తో పాటు, జట్టు సభ్యులపై కూడా జరిమానా చెల్లించాలని ఐపీఎల్ పేర్కొంది. దీంతో సచిన్‌ టెండూల్కర్ 40,000 డాలర్లు, జట్టు సభ్యులు 10,000 డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ముంబైలో మంగళవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన 27వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలోనే మ్యాచ్‌ను పూర్తి చేయలేకపోయింది. ఇంకా ఒక ఓవర్ సమయాన్ని అదనంగా ఆడటంతో సచిన్ సేనపై ఐపీఎల్ యాజమాన్యం భారీ జరిమానాను విధించింది.

ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ (ఏడు మ్యాచ్‌ల విజయాలు, 12 పాయింట్లతో) ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. సెమీస్‌కు చేరువలో ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments