ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్లో ఆడేందుకు వివాదాస్పద ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్, తిరిగి ఫిట్నెస్ పొందిన పేస్బౌలర్ బ్రెట్లీ, బ్యాట్స్మెన్ డేవిడ్ హసీలకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ క్రికెటర్లు ఐపీఎల్లోని తమతమ జట్లకు త్వరలో అందుబాటులోకి రానున్నారు.
ఇదిలాఉంటే వైద్య పరీక్షల్లో విఫలమైన షేన్ వాట్సన్, నాథన్ బ్రాకెన్, జేమ్స్ హోప్స్లను మాత్రం ఐపీఎల్ రెండో సీజన్కు అనుమతించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నిరాకరించింది. త్వరలో ఇంగ్లాండ్ల జరగబోతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్కు సిద్ధమవ్వాలని వీరికి సూచించింది.
సైమండ్స్ (డెక్కన్ ఛార్జర్స్), బ్రెట్లీ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), హసీ (కోల్కతా నైట్రైడర్స్)లు గురువారం పాకిస్థాన్తో జరిగిన ట్వంటీ- 20 మ్యాచ్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. జోహనెస్బర్గ్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్కు కోల్కతా నైట్రైడర్స్కు హసీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.