Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిద్దరూ ఉంటే పరుగుల వరదే : ధోనీ

Webdunia
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు క్రీజ్‌లో ఉన్నట్లయితే... అద్భుతమైన షాట్లతో, ముచ్చటగొలిపే బ్యాటింగ్ విన్యాసంతో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తూ పరుగుల వరద పారిస్తారని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొనియాడాడు.

ఆదివారం కివీస్‌‌తో జరిగిన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన అనంతరం ధోనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సచిన్ అద్భుతమైన ఆటగాడనీ, అతను ఆడిన షాట్లు చూడముచ్చటగా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక యూవీ ఫామ్‌లో ఉన్నట్లయితే, అతడిని మించిన ప్రమాదకరమైన ఆటగాడు మరొకడు లేడని అన్నాడు. వీరి ఆటతీరుతో స్కోరు బోర్డు పరుగులెత్తుందని ముందుగానే ఊహించామని ధోనీ చెప్పాడు.

తమ బ్యాట్స్‌మెన్‌పై తనకు అపారమైన నమ్మకముందని... ఒక్కోసారి బౌలర్లు తగినంతగా లేకపోతే బ్యాట్స్‌మెన్‌కు పూర్తి సహకారం అందించి, భారీ స్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేస్తామని ధోనీ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో జట్టు తరపున జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని, అలాగే కివీస్‌లోని చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపే విషయంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన బౌలర్లకు సూచించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments