Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్: లంక బయలుదేరిన టీం ఇండియా

Webdunia
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీం ఇండియా బయలుదేరి వెళ్లింది. ఈ సిరీస్‌ను గెలుచుకునే సత్తా టీం ఇండియాకు ఉందని ఈ సందర్భంగా జట్టు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. ప్రపంచంలో నెంబర్‌వన్ జట్టు అయ్యేందుకు టీం ఇండియా సరైన మార్గంలో ముందుకెళుతుందని చెప్పారు.

బుధవారం కిర్‌‍స్టెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జట్టులోని ఆటగాళ్లందరూ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ఇంగ్లండ్‌లో ట్వంటీ- 20 ప్రపంచకప్ వైఫల్యం ఎవరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని ఉద్ఘాటించారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో శ్రీలంక వెళుతున్నాము. ఇటీవల లభించిన విశ్రాంతి ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశ్రాంతి లభించడం మంచిదే.

ముఖ్యంగా చాలా క్రికెట్ ఆడిన తరువాత విశ్రాంతి ఎంతో అవసరం. వచ్చే నెలల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ముగిసిన కార్పొరేట్ కప్‌తో ఆటగాళ్లకు అవసరమైన ప్రాక్టీసు కూడా లభించిందన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments