Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడోదరా వన్డే: భారత్ విజయ లక్ష్యం 225 పరుగులు

Webdunia
FILE
భారత్‌తో జరుగుతున్న వడోదరా వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా యంగ్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు విజృంభించడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి, 224 పరుగులకే పరిమితమైంది. తద్వారా భారత్‌కు 225 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. భారత బౌలింగ్ ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఫ్రాంక్లిన్ (72; 108 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్; నాటౌట్), నాథన్ మెక్ కల్లమ్ (43)లు మాత్రమే రాణించగలిగారు. దీంతో కివీస్ 224 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకోగలిగింది.

మిగిలిన బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ గుప్తిల్ (12), మెక్ కల్లమ్ (0), విలియమ్సన్ (21), టైలర్ (4)లు జహీర్ ఖాన్, పటేల్ బౌలింగ్‌ వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఇదే తరహాలో స్టైరిస్ (22), వెట్టోరి (3), హోప్కిన్స్ (6)లు కూడా అశ్విన్, యూసుఫ్ పఠాన్‌లకు వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి ఫ్రాంక్లిన్ (72) మాత్రమే నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 50 ఓవర్లలో కివీస్ 9వికెట్లు కోల్పోయి 224 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశ్విన్, పఠాన్‌లు రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, పటేల్ ఏకైక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments