Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ఆటగాళ్లకు పరిహారం అందుతుందా..?!

Webdunia
లాహోర్‌లో ఉగ్రవాదుల దాడి నుంచి బ్రతికి బయటపడ్డ శ్రీలంక ఆటగాళ్లకు ఇంకా నష్టపరిహారం అందలేదు. అసలు అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పరిహారం విషయంలో లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సి) ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని స్థానిక పత్రికలు ఆరోపిస్తున్నాయి.

దాడిలో గాయపడ్డ లంక క్రికెటర్లకు వైద్య సేవలయితే అందాయిగానీ... పరిహారం చెల్లించే విషయంలో బోర్డు నుంచి ఎలాంటి స్పందనా లభించటం లేదని పై మీడియా కథనం వెల్లడించింది. దాడిలో గాయపడ్డ లంక ఆటగాళ్లు, అధికారులు అనుభవించిన మానసిక వేదన, భయాందోళనలకు బీమా పాలసీలో కవరేజి లేదు కాబట్టి, వారికేమీ పరిహారం అందటం లేదని మీడియా ఆరోపించింది.

ఇదిలా ఉంటే... పాకిస్థాన్ జట్టుతో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న శ్రీలంక జట్టు.. మార్చి మూడవ తేదీన లాహోర్లోని గడాఫీ స్టేడియంకు వెళుతుండగా... 12 మంది సభ్యులు గల ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో లంక జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు, ఒక అసిస్టెంట్ కోచ్‌ గాయపడగా, లంక ఆటగాళ్లకు భద్రత కల్పిస్తున్న ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments