దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్కు గాయం తగిలింది. కేప్టౌన్లో జరుగుతున్న మూడో టెస్టులో 161 పరుగులతో అజేయంగా నిలిచిన జాక్వెస్ కలిస్కు ఛాతిలో గాయం ఏర్పడింది. దీంతో కలిస్కు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. తద్వారా భారత్తో జరుగనున్న వన్డే సిరీస్కు కూడా కలిస్ దూరమయ్యే అవకాశముందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.
కలిస్కు గాయం ఏర్పడటంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో అవసరమైతేనే తప్ప జాక్వెస్ క్రీజులో దిగడని తెలుస్తోంది. కాగా.. కేప్టౌన్ మూడో టెస్టు రెండో రోజైన సోమవారం జాక్వెస్ కలిస్ 161 పరుగులతో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 39 సెంచరీల రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.